వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీమైన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సీమైన్లను తొలగించేందుకు సుమారు ఆర్నెళ్ల సమయం పడుతుందని అమెరికా చట్టసభ ప్రతినిధులకు పెంటగాన్(Pentagon) తెలిపింది. హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీతో జరిగిన క్లాసిఫైడ్ బ్రీఫింగ్ సమయంలో రక్షణశాఖ ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఎంత ఖర్చు అయ్యిందన్న అంశాన్ని చట్టసభ ప్రతినిధులు ప్రశ్నించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్పై దాడి జరిగిన సమయంలో ఓ స్కూల్పై కూడా బాంబు పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మినాబ్ పాఠశాలకు చెందిన సుమారు 168 మంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన పట్ల కూడా చట్టసభ ప్రతినిధులు పెంటగాన్ బ్రీఫింగ్లో ప్రశ్నలు కురిపించినట్లు తెలిసింది. కానీ దానికి సరైన సమాధానాలు దొరకలేదు.