ఇస్లామాబాద్: ఇన్ఫెక్షన్ల నుంచి దూరంచేసేందు నిర్ణీత వయస్సు వచ్చేవరకు చిన్నారులకు వ్యాక్సిన్లు (Vaccination) ఇస్తుంటారు. అలాంటి వ్యాక్సిన్లను అడ్డుకునే తల్లిదండ్రులకు కఠిన శిక్షలు అమలు చేయాలని పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్ (Sindh province) ప్రభుత్వం నిర్ణయించింది. పోలియో వ్యాక్సిన్లను (Polio Vaccination) తమ చిన్నారులకు ఇచ్చేందుకు నిరాకరించే తల్లిదండ్రులకు నెల రోజులపాటు జైలు శిక్ష, రూ.50 వేల (పాక్ కరెన్సీ) జరిమానా విధిస్తూ కొత్తగా చట్టం రూపొందించింది. పాక్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
డబ్ల్యూహెచ్వో (WHO) గణాంకాల ప్రకారం 2023లో పాక్లో 2 పోలీయో కేసులు నమోదయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 20గా ఉన్నది. కాగా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లో పోలియో ఎండెమిక్ స్థాయిలో ఉన్నది. అందువల్ల కొత్తగా కేసులు నమోదవకుండా స్థానిక ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, మీజిల్స్ రూబెళ్లా వంటి వ్యాధులు రాకుండా నివారించేందుకు చిన్నారులకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు.