ఇస్లామాబాద్: సైఫర్ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan)కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులోనే మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి కూడా బెయిల్ మంజూరీ చేశారు. పది లక్షల పూచీకత్తు బాండ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. జస్టిస్ సర్దార్ తారిక్ మసూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును ఆదేశించింది. ఈ బెంచ్లో జస్టిస్ అతర్ మినల్లా, సయ్యిద్ మన్సూర్ అలీఖాన్ ఉన్నారు.