ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో(Pakistan Occupied Kashmir)ని నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా దళాలు ఫైరింగ్కు పాల్పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతిచెందగా, మరో 200 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. రావల్కోట్, బింబేర్, ముజాఫరాబాద్లో పరిస్థితి దారుణంఆ ఉంది. పాక్ దళాలు చాలా క్రూరంగా ఫైరింగ్కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. టియర్ గ్యాస్తోనూ నిరసనకారుల్ని చెదరగొట్టారు.
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) అనే సంస్థ ఇచ్చిన ఆందోళన మేరకు జనం నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆర్థిక, రాజకీయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓ ఆస్పత్రి మార్చురీ వద్ద భారీ సంఖ్యలో జేఏఏసీ కమిటీ మద్దతుదారులు చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రూపులోని కొందరు ఆటోమెటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులను వాడారు. జూలై 27వ తేదీన జరగనున్న ప్రాంతీయ ఎన్నికల్లో శరణార్థులకు 12 సీట్లు కేటాయించరాదు అని జేఏఏసీ పేర్కొన్నది
Trump’s favourite field Marshal is firing on innocent civilians.. #PoK #HumanRights #Pakistan pic.twitter.com/D8WwJYgNfL
— Aakanksha Rai (@NationalistAkku) June 9, 2026