ఇస్లామాబాద్ : పాక్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్ఖాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించగా.. ఆ తర్వాత పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రెడిసెంట్కు సిఫారసు చేశారు. ఆ తర్వాత వెంటనే అధ్యక్షుడు పార్లమెంట్ను రద్దుకు ఆమోదముద్ర వేయగా.. ఆపధర్మ ప్రధానిగా నియమించారు. ఈ క్రమంలో మంగళవారం పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల పంపిణీపై సంప్రదింపులు జరించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ‘ది నేషన్’ వెల్లడించింది.
సమావేశానికి ఇమ్రాన్ అధ్యక్షత వహిస్తారని పేర్కొంది. వాస్తవానికి ఎన్నికలు 2023లో జరుగాల్సి ఉన్నది. కొత్త ప్రధానిని నియమించే వరకు ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగుతారని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఉత్తర్వులు జారీ చేశారు. 342 మంది సభ్యులున్న పార్లమెంట్ దిగువ సభలో మెజారిటీని కోల్పోయిన తర్వాత ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తిరస్కరించారు. ప్రధాని కోరిక మేరకు అధ్యక్షుడు అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. అయితే, ప్రతిపక్ష పార్టీ మార్చి 8న ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సంకీర్ణ ముత్తాహిదా ఖౌమీ పార్టీ ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొని.. ప్రతిపక్ష పీపుల్స్ పార్టీ (పీపీపీ)తో జతకలిసింది.