Imran Khan | పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖ్వాసియర్, డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తమ పదవులకు రాజీనామా చేశారు. ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం అర్ధరాత్రి ముగిసే వరకు ఓటింగ్ నిర్వహించలేదు. కోర్టు ధిక్కారనేరానికి పాల్పడినందుకు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది.
శనివారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఇమ్రాన్ఖాన్ సర్కార్.. ఓటింగ్ నిర్వహించాలని నేషనల్ అసెంబ్లీ స్పీకర్ను రెండు రోజుల క్రితం పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కార నేరంపై విచారణ జరుపాలని కోరుతూ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విస్తృత స్థాయి ధర్మాసనం అర్ధరాత్రి విచారించనున్నది.
మరోవైపు పాక్ పార్లమెంట్ బయట ఖైదీల వ్యాన్ను నిలిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అర్ధరాత్రి 12 గంటలకు సుప్రీంకోర్టు తలుపులు తెరవాలని అధికారులను చీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియాల్ ఆదేశించారు.