లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన లాహోర్, మియాన్వాలీల నుంచి దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.
ఆయన సన్నిహితుడు షా మహమూద్ ఖురేషీ దాఖలు చేసిన నామినేషన్లను, మాజీ మంత్రి హమ్మద్ అజహర్ నామినేషన్ను కూడా తిరస్కరించింది. అల్పమైన కారణాలను చూపి తమ నామినేషన్లను ఈసీ తిరస్కరించిందని ఇమ్రాన్, ఆయన పార్టీ ఆరోపిస్తున్నది.