ఇస్లామాబాద్ : పోటెత్తిన వరదతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 937కి చేరడంతో పాకిస్తాన్ శుక్రవారం నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వరద బీభత్సంతో 343 మంది చిన్నారులు మరణించగా దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వరదలు, భారీ వర్షాల కారణంగా సింధ్ ప్రావిన్స్లో జూన్ 14 నుంచి ఇప్పటివరకూ అత్యధికంగా 306 మంది ప్రాణాలు కోల్పోయారు.
బలూచిస్తాన్లో 234 మరణాలు చోటుచేసుకోగా పతున్వఖ, పంజాబ్ ప్రావిన్స్లో వరుసగా 185 మంది, 165 మంది మరణించారని నేషనల్ డిజాస్టార్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) వెల్లడించింది. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో వరద ఉధృతికి 37 మంది మరణించారు.