ఇస్లామాబాద్, అక్టోబర్ 10: పాక్ అణ్వాయుధ పితామహుడిగా పేరుగాంచిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. 1936లో భోపాల్లో జన్మించారు. దేశ విభజన సమయంలో పాక్కు వలసవెళ్లారు. అనారోగ్యంతో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆగస్టు 26న కరోనా పాజిటివ్ వచ్చింది. కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తర్వాత అనారోగ్యంతో దవాఖానలో చేరారు. ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. ఖదీర్ ఖాన్ మృతి పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం ప్రకటించారు.