ఇస్టామాబాద్: పదేపదే లైంగికదాడులకు పాల్పడే నేరగాళ్లకు కఠిన శిక్ష అమలు చేసే దిశగా పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి కంటే ఎక్కువ లైంగికదాడుల కేసుల్లో దోషులుగా తేలినవారికి కెమికల్ క్యాస్ట్రేషన్ చేయనున్నారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ క్రిమినల్ లా సవరణ బిల్లు 2021ను ఆమోదించింది. మందుల ద్వారా భవిష్యత్లో శృంగారానికి పనికిరాకుండా చేయడాన్నే కెమికల్ క్యాస్ట్రేషన్గా పిలుస్తారు. దక్షిణకొరియా, పోలాండ్, చెక్రిపబ్లిక్, అమెరికాలోని పలు రాష్ర్టాల్లో ఈ విధానం అమల్లో ఉన్నది. పాక్లో పిల్లలు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్న నేపథ్యంలో దోషులను పట్టుకొని త్వరితగతిన శిక్ష వేయాలని గత కొంతకాలంగా పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కెమికల్ క్యాస్ట్రేషన్ చేసే ముందు దోషి అనుమతిని కూడా తీసుకోవాలని చట్టంలో పేర్కొన్నారు.