ఇస్లామాబాద్: పాకిస్థాన్లో హిందూ అధ్యాపకుడికి (Hindu Teacher) స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. దేవుడిని దూషించాడనే (Blasphemy) అభియోగాలపై అతనికి జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించింది. సింధు ప్రావిన్స్కు చెందిన నౌతన్ లాల్.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. 2019లో దైవాన్ని దూషించినందుకుగాను అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. తాజాగా నౌతన్ లాల్కు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
పాకిస్థాన్లో 1947 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,415 దైవదూషణ కేసులు నమోదయ్యాయి. 18 మంది మహిళలు, 71 మంది పురుషులకు మరణ శిక్ష విధించారు. అయితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని డాన్ పత్రిక పేర్కొన్నది. కాగా, దేవుడిని దూశించారనే అభియోగాలపై శిక్షింపబడినవారిలో ఎక్కువగా పంజాబ్కు చెందినవారే ఉన్నారని తెలిపింది.