వాషింగ్టన్, అక్టోబర్ 20: భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్’ను తెలుగు బిడ్డ, మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల (55) అమెరికాలో అందుకొన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్ నుంచి గత వారం ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 17 మందికి పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించిన విషయం విదితమే. వారిలో సత్య నాదెళ్ల ఒకరు. వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటిస్తానని నాదెళ్ల చెప్పారు.