కరోనా వైరస్ ఉద్ధృతి సమయంలో ప్రతి ఒక్కరూ ఆక్సీజన్ గురించే మాట్లాడుకున్నారు. ఈ ఆక్సీజన్ను సరిగ్గా 247 ఏండ్ల క్రితం 1774 లో ఇదే రోజున ఇంగ్లిష్ శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ (Oxygen was discovered) కనిపెట్టారు. మెర్క్యూరిక్ ఆక్సైడ్ను కాల్చడం ద్వారా డీఫ్లాజిస్టిక్ గాలిని తొలుత కనుగొన్నాడు. ఈ వాయువునే తర్వాతి రోజుల్లో ప్రాణవాయువుగా పిలుచుకున్నారు.
గాలిలో వివిధ పదార్థాలను ఎలా కాల్చివేయవచ్చుననే విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి. 1772 లో స్వీడిష్ శాస్త్రవేత్త కార్ల్ విల్హెల్మ్ షీల్ ఒక ప్రయోగం చేస్తూ మాంగనీస్ ఆక్సైడ్, పొటాషియం నైట్రేట్లను అనేక మూలకాల మిశ్రమంతో కలిపి వేడిచేయగా ఒకరకమైన గ్యాస్ బయటకు వచ్చింది. ఈ గ్యాస్లో కొన్ని పదార్థాలు వేగంగా కాలిపోతున్నట్లు షీల్ గమనించారు. ఈ వాయువుతోనే జంతువులు కూడా ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు గుర్తించాడు. ఈ వాయువుకు షీల్ ‘అగ్ని గాలి’ అని పేరు పెట్టారు.
రెండేండ్ల తర్వాత 1774 లో ఇంగ్లిష్ శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ ఇదే మాదిరి పరిశోధనలు చేస్తూ ఒక వాయువు బయటకు రావడాన్ని కనిపెట్టాడు. మెర్క్యూరిక్ ఆసిడ్ను ఒక గిన్నెలో వేడి చేసి దాని నుంచి వెలువడే వాయువును మరో బౌల్లో సేకరించాడు. ఈ వాయువును బయటి వాతావరణంలో పెట్టినప్పుడు మరింత ఎక్కువగా మండే గుణాన్ని బయటపెట్టి తన పరిశోధనను ప్రపంచానికి చాటిచెప్పాడు. అయితే, ఈ వాయువుపై మరో శాస్త్రవేత్త ఆంథోనీ లేవిజర్.. విశేష పరిశోధన చేసి ఆక్సీజన్ అని పేరు పెట్టారు.
ఇవాళ బాల గంగాధర తిలక్ 101 వ వర్ధంతి
1994: లిసా మేరీ ప్రెస్లీని వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్
1971: న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ కోసం ఛారిటీ కచేరి నిర్వహించిన బీటిల్స్కు చెందిన జార్జ్ హారిసన్, పండిట్ రవిశంకర్
1960: పాకిస్తాన్ రాజధానిని కరాచీ నుంచి ఇస్లామాబాద్కు మార్పు
1957: నేషనల్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు
1953 : భారతదేశంలోని 8 విమానయాన సంస్థలను జాతీయం చేసిన ప్రభుత్వం
1936: బెర్లిన్లో ఒలింపిక్ క్రీడలను ప్రారంభించిన అడాల్ఫ్ హిట్లర్
1920 : సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..