కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 11వ రోజుకు చేరింది. అయితే ఆదివారం నాటికి 11,000 మందికిపైగా రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యాకు చెందిన 44 యుద్ధ విమానాలు, 48 సైనిక హెలికాప్టర్లను కూల్చివేసినట్లు చెప్పింది. అలాగే 295 ట్యాంకులు, 109 ఆర్టిలరీని నాశనం చేసినట్లు పేర్కొంది. 985 సాయుధ వాహనాలు, 447 మిలిటరీ కార్లు, 60 ఇంధన వాహనాలు, 21 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్లు, 4 యూఏవీలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. రష్యాకు చెందిన 50 క్షిపణి లాంచ్ వాహనాలతోపాటు రెండు బోట్లను బాంబులతో పేల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది.
మరోవైపు ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఖేర్సన్ను ఆక్రమించిన రష్యా బలగాలు.. సముద్ర తీర ప్రాంతాలైన మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను చుట్టుముట్టాయి. కీవ్పై రష్యా దళాలు బాంబు దాడులను కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధానిపై పట్టుకోసం తీవ్రంగా యత్నిస్తున్నాయి. అయితే ఉక్రేనియన్ ఆర్మీ చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది.
These are the indicative estimates of Russia's losses as of March 6, according to the Armed Forces of Ukraine. pic.twitter.com/TgPPCn565U
— The Kyiv Independent (@KyivIndependent) March 6, 2022