న్యూఢిల్లీ: ఇండియాకు 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను అందించడానికి తమ మెడికల్ స్లపయర్స్ ఓవర్టైమ్ పని చేస్తున్నారని చైనా చెప్పింది. ఇండియా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా భారీ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ఇండియాకు చైనా రాయబారి అయిన సన్ వీడాంగ్ బుధవారం ఓ ట్వీట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇండియా నుంచి వచ్చిన ఆర్డర్ల కోసం చైనా సప్లయర్స్ ఓవర్టైమ్ పని చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కనీసం 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం ఆర్డర్లు వచ్చాయి. ఈ మెడికల్ సరఫరాలను తీసుకెళ్లడానికి కార్గో విమానాలు సిద్ధంగా ఉన్నాయి. సంబంధిత ప్రక్రియను చైనా కస్టమ్స్ వాళ్లు చూసుకుంటారు అని వీడాంగ్ ట్వీట్ చేశారు.
మరోవైపు చైనా జాతీయ ఎయిర్లైన్స్ అయిన సిచువాన్ ఎయిర్లైన్స్ మాత్రం ఇండియాకు అన్ని కార్గో విమానాలను రద్దు చేయడం గమనార్హం. 15 రోజుల పాటు నిషేధించడంతో ఇండియాకు రావాల్సిన అత్యవసరాలు ఆగిపోయాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియాకు సాయం చేస్తున్నామని ప్రకటించగానే.. చైనా కూడా హుటాహుటిన ఈ ప్రకటన చేయడం విశేషం.
Chinese medical suppliers are working overtime on orders from India, at least 25000 orders for oxygen concentrators in recent days. Cargo planes are under plan for medical supplies. Chinese customs will facilitate relevant process.
— Sun Weidong (@China_Amb_India) April 28, 2021