టెక్సాస్ : టెక్సాస్లోని ఓ మున్సిపల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో సింగిల్ ఇంజిన్ ఉన్న చిన్నవిమానం కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఓ వ్యక్తి ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ఉత్తర హ్యూస్టన్కు 160 కిలోమీటర్ల దూరంలోని మాడిసన్విల్లే విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. విమానం ఎందుకు కూలిపోయిందో తెలియరాలేదని, కారణాలను విశ్లేషిస్తున్నామని టెక్సాస్ ప్రజాభద్రతా విభాగం అధికార ప్రతినిధి జస్టిన్ రూయిజ్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.