లండన్ : ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తున్నది. ఈ ఉత్పరివర్తనంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వేగంగా విస్తరిస్తున్న వేరియంట్తో మరో మరో వేవ్ తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. కొత్త వేరియంట్పై యూకేలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదనపు భద్రతా చర్యలు తీసుకోకుంటే వచ్చే ఏప్రిల్ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలకు ఒమిక్రాన్ వేరియంట్ కారణమవుతుందని హెచ్చరించారు.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్బోష్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా పరిశోధనను నిర్వహించారు. ఇతర దేశాల కంటే యూకేలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రతి రోజు 600 మందికిపైగా ఒమిక్రాన్ బారినపడుతున్నారు. అయితే, ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసు అందిస్తున్నా.. ఆసుపత్రిలో చేరే అవకాశాలు 60శాతానికి పెరిగాయి.
సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే ఒమిక్రాన్ బాధితులు వేగంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ కరోనా కొత్త ఉత్పరివర్తనం తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందా? అన్నదానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. డెల్టా వేరియంట్తో పోలిస్తే వేరియంట్ బాధితుల్లో తేలికపాటి లక్షణాలు ఉంటాయని పేర్కొంటున్నారు. కానీ, రోగుల సంఖ్య పెరుగుతుండగా.. ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్లో నమోదైన విషయం తెలిసిందే. భారత్లో ఇప్పటి వరకు 38 మంది కొత్త వేరియంట్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు.