సియోల్, జనవరి 19: అణ్వస్త్ర సామర్థ్యమున్న సముద్రగర్భ డ్రోన్ను ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన నౌకదళ కసరత్తులకు ప్రతిస్పందనగా శుకవ్రారం ఈ డ్రోన్ను పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియన్ ద్వీపకల్ప ప్రాంతంలో ఉద్రిక్తతలకు అమెరికా దాని ఆసియా మిత్ర దేశాలే కారణమని ఆరోపించింది. తాము పరీక్షించిన డ్రోన్ నౌకలను, నౌకాశ్రయాలను ధ్వంసం చేస్తుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. దక్షిణ కొరియాతో శాంతియుతంగా తిరిగి ఐక్యమవ్వాలన్న తమ దీర్ఘ కాల లక్ష్యాన్ని చెరిపేసి ఆ దేశాన్ని ప్రధాన శత్రు దేశంగా నిర్వచిస్తూ తమ రాజ్యాంగాన్ని తిరిగి రాసుకుంటామని ఆయన అన్నారు.