ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) అగ్రదేశం అమెరికా (USA) కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తమ జోలికి వస్తే ఊరుకునేదని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో.. దాన్ని ఉద్దేశించి అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఎదురయ్యే ముప్పును అన్ని మార్గాల ద్వారా ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా రక్షణ శాఖ తాజాగా స్పందించింది.
‘మా అంతరిక్ష ఆస్తులపై అమెరికా దాడులకు ప్రయత్నిస్తే మేం ఆ దేశ నిఘా శాటిలైట్లను ధ్వంసం చేస్తాం. అలాంటి చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తాం’ అని అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరించింది. కాగా, నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కిమ్ ప్రభుత్వం గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఈ నెల ప్రారంభంలో రష్యా సహకారంతో శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది.
ఈ నిఘా ఉపగ్రహ ప్రయోగం గత వారం జరిగింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లాంచింగ్ను వీక్షించారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. రోదసీ ప్రయోగాల ద్వారా ఎదురయ్యే ముప్పును వివిధ మార్గాల ద్వారా ఎదుర్కొంటామని అమెరికా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అమెరికా ప్రకటనపై స్పందించింది. మా జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది.