సియోల్: ఉత్తరకొరియాలో కరోనా కలకలం కొనసాగుతున్నది. దేశంలో కొత్తగా లక్షా 86 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,86,094 మందికి జ్వర లక్షణాలు బయటపడ్డాయని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ప్రకటించింది. ఇప్పటివరకు 67 మంది మరణించారని తెలిపింది.
కిమ్ రాజ్యంలో ఏప్రిల్ చివరి వారం నుంచి జర్వం బాధితులు నానాటికి పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2.64 మిలియన్లకు చేరింది. ఇందులో 2.06 మిలియన్ల మంది కోలుకున్నారని కేసీఎన్ఏ వెల్లడించింది. దేశంలో మొదటి కరోనా మరణం ఈ నెల 12న నమోదైన విషయం తెలిసిందే.