సియోల్: ఉత్తర, దక్షిణ కొరియా మధ్య మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది. ఉత్తర కొరియా(North Korea) ఇవాళ దక్షిణ కొరియా ద్వీపంపై ఆర్టిల్లరీ షెల్స్పై ఫైర్ చేసింది. సుమారు 200 షెల్స్ను ఫైర్ చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఇయాన్పియాంగ్ ద్వీపంపై ఫైరింగ్ జరిగినట్లు సియోల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఫైరింగ్ నేపథ్యంలో దక్షిణ కొరియా సుమారు రెండు వేల మంది పౌరుల్ని ఆ ద్వీపం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఉత్తర కొరియా మళ్లీ రెచ్చగొడుతున్నట్లు దక్షిణ కొరియా పేర్కొన్నది.
2010లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పడు జరిగిన ఫైరింగ్లో ఇయాన్ఫియాంగ్ ద్వీపంలో నలుగురు మృతిచెందారు. అయితే తాజాగా ఉత్తర కొరియా బోర్డర్ వద్ద.. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఆ విన్యాసాలను ఉత్తర కొరియా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉత్తర కొరియా వివాదాస్పద ద్వీపంపై ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది.