ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా ఇవాళ రెండు బాలిస్టక్ మిస్సైళ్లను పరీక్షించింది. ఈ ఏడాది ఈ పరీక్షలు చేపట్టడం ఆ దేశానికి ఇది నాలుగవసారి. సునన్ అనే ప్రాంతం నుంచి ఆ మిస్సైళ్లను పరీక్షించినట్లు దక్షిణ కొరియా సైన్యం పేర్కొన్నది. అయితే ఆ క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయో ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించిన విషయాన్ని జపాన్ ప్రధాని కార్యాలయం కూడా ద్రువీకరించింది. ఆ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆదేశించారు. జపాన్ సముద్ర జలాల్లో తిరుగుతున్న నౌకలకు కోస్టు గార్డు వార్నింగ్ సంకేతాలు ఇచ్చారు. జనవరి 5, 11వ తేదీల్లో ఉత్తర కొరియా హైపర్సోనిక్ మిస్సైళ్లను పరీక్షించినట్లు తెలిసిందే. ఇక జనవరి 14వ తేదీ ఓ రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్షించినట్లు తెలుస్తోంది. క్షిపణి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉత్తర కొరియా ఇటీవల వరుసగా మిస్సైల్ టెస్ట్లను నిర్వహిస్తోంది. .