బీజింగ్, జనవరి 13: ‘మాల్దీవులు చిన్న దేశమే కావొచ్చు, కానీ మమల్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు’ అని ఆ దేశాధ్యక్షుడు మహమద్ మాయిజ్జు తాజాగా వ్యాఖ్యానించారు. చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరిస్తామంటే కుదరదని భారత్ను ఉద్దేశించి అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా మారినవేళ భారత్పై మాయిజ్జు విరుచుకుపడ్డారు. చైనాలో ఐదు రోజుల పర్యటన ముగించుకొని మాల్దీవులకు బయల్దేరుతుండగా, శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. చైనా నుంచి మరింత మంది పర్యాటకులు మాల్దీవులకు వచ్చేట్టు చూడాలని బీజింగ్ నాయకత్వాన్ని ఆయన మరోమారు కోరారు.