Nikki Haley | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఐక్యరాజ్య సమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ కీలక సూచనలు చేశారు. భారత్ను చైనాలాంటి ప్రత్యర్థిలా కాకుండా విలువైన స్వతంత్ర, ప్రజాస్వామ్య భాగస్వామిగా చూడాలని సూచించారు. గత 25 సంవత్సరాలుగా భారత్తో ఏర్పరచుకున్న సంబంధాలను అమెరికా వేగంగా ఆపివేస్తే అది వ్యూహాత్మక విపత్తు అవుతుందని హెచ్చరించారు. భారత్, చైనా మధ్య బలమైన భాగస్వామ్యం చాలా సులభమని నిక్కీ హేలీ అభివర్ణించారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని.. దాని పెరుగుదల స్వేచ్ఛా ప్రపంచానికి ముప్పే కాదని స్పష్టం చేశారు.
దీనికి విరుద్ధంగా చైనా కమ్యూనిస్ట్ పాలనలో నడుస్తున్నందున దాని పెరుగుతున్న శక్తి ఓ సవాల్గా పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా చైనా ఆంక్షలను తప్పించుకుంటుండగా.. మాస్కోకు అతిపెద్ద కస్టమర్ అన్నారు. అమెరికాకు భారత్ కీలకమైన మిత్రదేశంగా మారగలదన్నారు. ఆసియాలో చైనాతో పోటీపడాలంటే ఈ సమతుల్యతను తీసుకువచ్చే ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా అర్థం చేసుకోవాలన్నారు. చైనాలాగానే పెద్ద ఎత్తున వస్తువులను తయారు చేసే సామర్థ్యం భారత్కు ఉందని హేలీ పేర్కొన్నారు. అమెరికా తన సరఫరా గెలుసును చైనా నుంచి భారత్కు మార్చేందుకు సహాయపడుతుందన్నారు.
భారతదేశం దుస్తులు, చౌకైన ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేయగలదని.. వీటిని అమెరికా స్వయంగా వెంటనే, పెద్ద ఎత్తున తయారు చేయలేమన్నారు. ముఖ్యంగా అమెరికా అక్కడ దళాల సంఖ్య, ఖర్చులను తగ్గించాలని కోరుకున్నప్పుడు.. భారతదేశం పెరుగుతున్న రక్షణ సామర్థ్యం, మధ్యప్రాచ్యంలో దాని పాత్ర ఆ ప్రాంతంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ముఖ్యమైనవని నిరూపించబడుతాయన్నారు. భారత భౌగోళిక స్థానం చైనా వాణిజ్య, ఇంధన సరఫరా మార్గాలపై ఒత్తిడిని కలిగిస్తుందని.. ఇది ఒక పెద్ద సంఘర్షణ విషయంలో చైనా ఆప్షన్ను తగ్గిస్తుందన్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ.
భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, త్వరలో జపాన్ను దాటిపోతుందని నిక్కీ హేలీ అన్నారు. చైనా ఎదుగుదలను భారత్ బలంగా మారుతున్న అడ్డుకోగలదన్నారు. 2020 గాల్వన్ లోయ వివాదంతో సహా భారత్, చైనా మధ్య అనేక వివాదాలు ఉన్నాయని నిక్కీ హేలీ గుర్తు చేశారు. అమెరికా భారతదేశం భాగస్వామి అయితే.. రెండు దేశాల ప్రయోజనాలు నెరవేరుతాయని.. చైనాకు వ్యతిరేకంగా మరింత బలంగా నిలబడగలదని ఆమె పేర్కొన్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య వివాదం దీర్ఘకాలం కొనసాగితే.. అది పెద్ద, తప్పించుకోలేని తప్పు అవుతుందని,, ఈ పరిస్థితిని చైనా సద్వినియోగం చేసుకోగలదంటూ హేలీ హెచ్చరించారు.