ఆక్లాండ్: న్యూజిలాండ్లోని అతిపెద్ద నగరం ఆక్లాండ్లో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ను సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగించారు. శరవేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ను నియంత్రించేందుకు కివీస్ ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. అలర్ట్ లెవల్ 4 లాక్డౌన్లో ఆక్లాండ్ ఉంటుందని ప్రధాని జెసిండా తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీ తర్వాత లెవల్ త్రీకి వెళ్తుందన్నారు. నగరంలో ఉన్న 20 లక్షల మంది స్టే ఎట్ హోమ్ ఆర్డర్స్కు కట్టుబడి ఉండాలని ప్రధాని జెసిండా ప్రెస్కాన్ఫరెన్స్ తెలిపారు. ఆక్లాండ్లో అంతుచిక్కని కొత్త కేసులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిటీ టెస్టింగ్ ద్వారా ఆ కేసులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. డెల్టా వేరియంట్ కేసు నమోదు అయిన తర్వాత న్యూజిలాండ్లో ఆగస్టు 17వ తేదీన దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు. కేవలం పట్టణాల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో స్టే ఎట్ హోమ్ ఆంక్షలను ఎత్తివేశారు.