జగ్దల్పూర్ : నక్సల్స్తో పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుందని ఈ దిశగా అమర జవాన్ల త్యాగాన్ని దేశం మరువదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్ఘఢ్లో శనివారం జరిగిన నక్సల్స్ దాడిలో మరణించిన జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. వీరమరణం పొందిన జవాన్ల భౌతిక కాయాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్తో కలిసి నక్సల్స్ దాడిపై జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో పాల్గొన్నారు.
దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజల తరపున తాను నక్సల్స్ దాడిలో మరణించిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించానని అమిత్ షా పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు సాయుధ గ్రూపులపై పోరును తీవ్రతరం చేస్తామని చెప్పారు. కాగా, చత్తీస్ఘఢ్లోని సుక్మా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 22 మంది సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ జవాన్లు వీరమరణ పొందిన విషయం తెలిసిందే.