రియాద్: పాలస్తీనాపై యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని ఇరాన్, సౌదీ నేతలు పిలుపునిచ్చారు. దాడులకు దిగిన గాజాలోని హమాస్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. (Israel-Palestine War) ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ వివాదంపై వారిద్దరూ చర్చించారు. పాలస్తీనాపై యుద్ధ నేరాలను ముగించాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయపడ్డారు.
కాగా, దాడుల తీవ్రత ఆపేందుకు అంతర్జాతీయంగాను, ప్రాంతీయంగాను అని ప్రయత్నాలు చేయడంతోపాటు అందరితో మాట్లాడుతున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ధృవీకరించారని ఆ దేశానికి చెందిన ఎస్పీఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అలాగే పౌరులను లక్ష్యంగా చేసుకునే ఏ చర్యనైనా సౌదీ అరేబియా తిరస్కరిస్తుందని మొహమ్మద్ బిన్ సల్మాన్ పునరుద్ఘాటించినట్లు పేర్కొంది.
మరోవైపు ఈ ఏడాది మార్చిలో చైనాతో జరిగిన ఒప్పందం వల్ల ఏడేళ్లుగా దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు సౌదీ అరేబియా, ఇరాన్ అంగీకరించాయి. తమ మధ్య విభేదాల వల్ల గల్ఫ్లో స్థిరత్వం, భద్రతకు ముప్పు కలుగుతుందని, తద్వారా మిడిల్ ఈస్ట్లో వివాదాలకు ఆజ్యం పోస్తుందని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో సంబంధాల పునరుద్ధరణ తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం గాజా అంశంపై ఫోన్లో తొలిసారి మాట్లాడుకున్నారు.