మాస్కో : తమ బలగాలు గత 24 గంటల వ్యవధిలో దాదాపు 700 మంది ఉక్రెయిన్ సైనికులను చంపేశాయని రష్యా రక్షణ శాఖ శనివారం వెల్లడించింది.
ఉక్రెయిన్ బలగాల స్థావరాలపై దాడుల్లో భాగంగా పలు ఆయుధ డిపోలు, హోవిట్జర్లు, యూఎస్ ఎం777 ఆర్టిలరీ వ్యవస్థలతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఉక్రెయిన దళాలు కుప్యాంక్స్ నగరం వైపు వెళ్లకుండా తమ పోడ్నోస్ మోర్టార్ బలగాలు నిలువరించాయని పేర్కొన్నది.