న్యూయార్క్, ఫిబ్రవరి 15: అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తున్న నాసా, తాజాగా చంద్రుడిపైకి మరో ల్యాండర్ ‘ద ఒడిస్సే’ను పంపింది. హూస్టన్కు చెందిన ప్రైవేట్ కంపెనీ ‘ఇంటూటైవ్ మెషిన్స్’ బుధవారం రాత్రి నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల నిమిత్తం నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఫిబ్రవరి 22న లూనార్ ల్యాండర్ ‘ద ఒడిస్సే’ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతుంది.