వాషింగ్టన్ : విశ్వం పుట్టుకకు సంబంధించిన రహస్యాలతో పాటు ఏలియన్స్ (Aliens) జాడను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేవీ ఇప్పటికే వరకు సఫలం కాలేదు. విశ్వం ఆవిర్భావం నాటి రహస్యాలను తెలుసుకునేందుకు ఇటీవల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (james webb space telescope)ను సైతం ప్రయోగించిన విషయం విధితమే. ఈ క్రమంలో నాసా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రహాంతరవాసుల ఆచూకీని తెలుసుకునేందుకు పూజారులను (priests) నియమించకోనున్నది.
ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతరవాసుల గురించి భిన్నమైన వాదనలు ఉన్నాయి. చాలాసార్లు జనం గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓ (UFO)లను చూశామని పేర్కొన్న సందర్భాలున్నాయి. అయితే, విశాల విశ్వం నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు లేవు. దీంతో గ్రహాంతరవాసుల ఉనికి ఇప్పటికీ ఇంకా మిస్టరీగానే ఉన్నది. విశ్వంలో ఎక్కడో ఒక చోటా ఖచ్చితంగా ఏలియన్స్ ఉంటారని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంపై సీరియస్గా ఉన్నది.
నాసాలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓల గురించి రహస్యాలకు సంబంధించిన గుట్టును విప్పే పనిలో నిమగ్నమయ్యారు. నాసా నియమించుకోనున్న ఆధ్యాత్మికవేత్తలు రహస్యాలను ఛేదించేందుకు సహాయం అందించనున్నారు. పూజారులను అంతరిక్షంలోకి పంపస్తారా? అనే ప్రశ్న అందరి మదిలో ఉత్పన్నమవుతున్నది. కేవలం ఏలియన్స్ రహస్యాలను ఛేదించేందుకు మాత్రమే నాసా 24 మంది పూజారుల సహాయం తీసుకోనుంది. మరో గ్రహంపై జీవం కనిపించిన తర్వాత వివిధ మతాలకు చెందిన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తున్నది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. గ్రహాంతరవాసుల వేటకు సంబంధించిన మిషన్లో 24 మంది ఆధ్యాత్మికవేత్తలు పాలుపంచుకోనున్నారు. బ్రిటన్ ప్రసిద్ధ పాస్టర్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ సైతం ఈ మిషన్లో భాగస్వామి కానున్నారు. మరొక గ్రహంపై జీవం కోసం అన్వేషణ.. దేవుడి గురించి, జీవానికి సంబంధించిన మూలాల గురించి ప్రజల ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు నాసా ప్రయత్నిస్తోంది. భూమిపైనే కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉండే ఉంటుందని నాసా భావిస్తున్నది. ఈ క్రమంలోనే నాసా ఏలియన్స్ను జాడ కోసం ప్రయత్నిస్తోంది. మరి ప్రయత్నంలో నాసా ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.