న్యూయార్క్, అక్టోబర్ 13: లోహ గ్రహశకలంపై పరిశోధనలు చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన సైకి మిషన్ విజయవంతమైంది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ శుక్రవారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ స్పేస్క్రాఫ్ట్ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
సైకి స్పేస్క్రాఫ్ట్ ఆరేండ్ల పాటు ప్రయాణించి భూమి నుంచి 3.6 బిలియన్ల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరుకోనున్నది. సాధారణంగా గ్రహశకలాలు రాతి లేదా మంచుతో ఉంటాయి. అయితే అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యనున్న ఈ గ్రహశకలం లోహాలతో నిండి ఉంది. దీనిపై పరిశోధనల ద్వారా భూమి పుట్టుక, జీవం గురించి తెలుసుకునే అవకాశం ఉందని నాసా భావిస్తున్నది.