న్యూయార్క్, మే 8: అమెరికాలో అంతుచిక్కని కాలేయవాపు వ్యాధి అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఐదుగురు చిన్నారులు మరణించగా, మరో 100 మందికి పైగా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఈ అంతుచిక్కని వ్యాధి నిగ్గు తేల్చే పనిలో పడింది.
25 రాష్ర్టాల్లో నమోదైన 109 కేసులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నది. ఇతర దేశాల నుంచి వ్యాప్తి చెందివుండొచ్చని సీడీసీ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి బారిన పడిన వారిలో 14 మందికి కాలేయ మార్పిడి అవసరమని, 90 శాతం మంది దవాఖానల్లో చేరాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.