పారిస్: ఫ్రాన్స్ విమానాశ్రయంలో (Paris airport) ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని చార్లెస్ డి గల్లె ఎయిర్పోర్ట్లోని డిపార్చర్స్ హాల్లో సుమారు 30 మంది ముస్లిం ప్రయాణికులు సామూహిక ప్రార్థనలు చేశారు. విమానంలో జోర్డాన్కు ప్రయాణించే ముందు సుమారు పది నిమిషాల పాటు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడ కలకలం రేపిన ఈ సంఘటన వివాదానికి దారి తీసింది. సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఫ్రాన్స్ రవాణా మంత్రి క్లెమెంట్ బ్యూన్ ఈ సంఘటనను ఖండించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి ప్రార్థనలను అనుమతించబోమని చెప్పారు. మరోసారి ఇలా జరుగకుండా, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడకుండా నిఘా ఉంచడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
🇫🇷 FLASH – Une prière collective musulmane ayant eu lieu hier à l’aéroport Roissy-Charles de Gaulle suscite la polémique. Cette photo diffusée par Noëlle Lenoir, ancienne ministre des Affaires étrangères, se demande ce que fait le PDG des Aéroports de Paris “quand son aéroport se… pic.twitter.com/KCpEF9hdwO
— AlertesInfos (@AlertesInfos) November 6, 2023