క్వెట్టా : పాక్ బలూచిస్థాన్ ప్రావిన్లో ఆదివారం పేలుళ్లలో ఐదుగురు మరణించారు. మరో పది మంది గాయపడ్డారని పాక్ మీడియా ఆదివారం తెలిపింది. క్వెట్టాలోని సబ్జల్ రోడ్లో జరిగిన గ్రనేడ్ దాడి జరిగినట్లు మీడియా పేర్కొంది. క్వెట్టా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు హ్యాండ్ గ్రనేడ్లు రోడ్డుపైకి విసరగా.. ఇందులో ఒకటి పేలిపోగా.. మరో గ్రనేడ్ను నిర్వీర్యంచేశారు. పేలుడు జరిగిన తీరును పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ బలూచిస్థాన్ సీఎం అబ్దుల్ ఖుదూస్ బిజెంజో నగరంలో భద్రతా ఏర్పాట్లను మరింత పకడ్బందీగా చేయాలని పోలీస్ చీఫ్కు ఆదేశించారు. గత కొద్దిరోజులుగా పాక్ ఉగ్రదాడులను ఎదుర్కొంటున్నది.