లండన్: లండన్లోని ఓ జంట తల్లి పాల నుంచి ఆభరణాలు తయారు చేస్తున్నది. సఫియ్యా రియాద్, ఆమె భర్త ఆడమ్ రియాద్లు కలసి ‘మెజంటా ఫ్లవర్’ పేరిట ఈ ఆభరణాలు తయారుచేస్తున్న సంస్థను నెలకొల్పారు. తమ పాలను జీవితాంతం గుర్తుగా దాచుకునేందుకు తల్లులకు వీరు ఉంగరాలు, బ్రేస్లెట్లను తయారుచేసి ఇస్తున్నారు. ఎలా అంటే పాలను ముందుగా రాళ్ల మాదిరిగా గట్టిగా మారుస్తున్నారు. ఆ తర్వాత బంగారం లేదా వెండితో తయారుచేసిన ఉంగరాలు, బ్రేస్లెట్లలో పొదుగుతున్నారు. ఇలా చేసిన రాళ్లు చాలా కాలం పాటు ఉంటున్నాయి. కరోనా లాక్డౌన్ సమయంలో ఓ వార్తాకథనంలో దీని గురించి చదివి ఈ సంస్థను ఏర్పాటు చేశామని ఆడమ్ వివరించాడు. ప్రస్తుతం ఏడాదికి రూ.15 కోట్ల మేర టర్నోవర్ సాధిస్తున్నామని చెప్పాడు. ఈ ఆభరణాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని ఈ జంట పేర్కొంటున్నది.