ఢాకా, అక్టోబర్ 4: జాతీయ పవర్ గ్రిడ్లో సమస్యతో బంగ్లాదేశ్లో అంధకారం అలుముకుంది. దేశవ్యాప్తంగా మంగళవారం కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తూర్పు ప్రాంతంలో ఎక్కడో ఓ చోట విద్యుత్తు సరఫరాలో సమస్య తలెత్తి ఉంటుందని బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అధికారి షమీమ్ హసన్ తెలిపారు. దేశ రాజధాని ఢాకాతోపాటు పెద్ద నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఎక్కడ సమస్య ఏర్పడిందో గుర్తించేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.