హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల (పీవోపీఎస్కే) సేవలను ఈ నెల 14వ తేదీ వరకు రద్దు చేసింది. అపాయింట్మెంట్ బుక్చేసుకున్న దరఖాస్తులను మే 17వ తేదీ నుంచి పరిశీలిస్తామని పేర్కొన్నది. అన్ని కేంద్రాల్లో అపాయింట్మెంట్ స్లాట్లను 50 శాతం తగ్గించింది. ఇకపై బేగంపేటలో రోజూ 410, అమీర్పేటలో 320, టౌలీచౌకిలో 350, నిజామాబాద్లో 100 దరఖాస్తులను మాత్రమే పరిశీలించనున్నది. పాస్పోర్ట్ అపాయింట్మెంట్ స్లాట్ను తగ్గించిన నేపథ్యంలో వెయిటింగ్ పీరియడ్ ఒక్కరోజు కాకుండా రెండు లేదా మూడు రోజులు ఉంటుందని చెప్పింది. దరఖాస్తుదారులు ఎవరికైనా కొవిడ్-19 లక్షణాలు ఉంటే వారి అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు పాస్పోర్టు రీజినల్ ఆఫీసర్ దాసరి బాలయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.