కీవ్: రష్యా ఆక్రమిత ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణుల దాడికి పాల్పడింది. రష్యా ఆక్రమిత క్రిమియాపై గత కొంత కాలం నుంచి దాడుల తీవ్రతను పెంచుతూ వచ్చిన ఉక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా సెవెస్తపోల్లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణులను ప్రయోగించింది. ఒక క్షిపణి నేరుగా తాకడంతో ఈ కేంద్ర కార్యాలయం మంటల్లో చిక్కుకుందని క్రిమియా అధికారులు తెలిపారు.
ముందుగా ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించారని చెప్పిన నౌకాదళ అధికారులు.. తర్వాత తమ సిబ్బందిలో ఒకరు కనిపించడం లేదని పేర్కొన్నారు. కాగా, నౌకాదళ కేంద్రం మంటల్లో చిక్కుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ దాడి విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది.
అయితే, గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్పై చేస్తున్న నౌకాదళ దాడులను రష్యా మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచే పర్యవేక్షిస్తున్నది. కాగా, దాడిలో 9 మంది మృతి చెందడమేగాక, 16 మంది గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని రష్యా ఇంకా ధ్రువీకరించలేదు.