వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందారు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జైన్ నాదేళ్ల సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కు ఈమెయిల్ ద్వారా వెల్లడించింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.
2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు. మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న జైన్ చిన్నప్పట్నుంచే వీల్ చైర్కు పరిమితం అయ్యారు.