పారిస్, ఆగస్టు 30: కాలుష్యాన్ని తగ్గించడానికి పారిస్ కీలక నిర్ణయం తీసుకొన్నది. వాహనాల గరిష్ఠ వేగ పరిమితిని 30 కిలోమీటర్లకు కుదించింది. పారిస్ వీధుల్లో ఏ మోటారు వాహన వేగమైనా గంటకు 30 కిలోమీటర్ల కంటే మించకూడదు. సోమవారం నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. వాహనాలను వేగంగా నడపడం వల్ల ఎక్కువ ఇంధనం మండి వాహనాల నుంచి కాలుష్య కారకాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఈ నిర్ణయాన్ని వాహన యజమానులు, డెలివరీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. కస్టమర్లు ఎక్కువసేపు ఎదురుచూడాల్సి రావచ్చని తెలుపుతున్నాయి. ఈ నిబంధనను మెజారిటీ ప్రజలు స్వాగతించారు.