రఫా : గాజా నగరంపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న 100 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా, 740 మంది గాయపడ్డారు. యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటివరకు 30 వేల మందికి పైగా మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వీరిలో మూడొంతుల మంది మహిళలు, చిన్నారులే. గాజా, ఉత్తర గాజాలో బాధితులకు సహాయం కూడా అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గాజాలో 23 లక్షల మంది పాలస్తీనియన్లు ఆకలితతో అలమటిస్తున్నారని, 80 శాతం మంది ఇళ్లను వదిలి వెళ్లిపోయారని ఐరాస ప్రకటించింది.