PM Modi : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి (US foreign Secretory) మార్కో రూబియో (Marco Rubio).. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తో సమావేశమయ్యారు. సేవా తీర్థ్ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనసాగింది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై వారు చర్చించినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) వెల్లడించారు. అదేవిధంగా వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ను ముందుకు నడిపించే మార్గాలపైనా ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు.
శనివారం ఉదయం అమెరికా నుంచి నేరుగా కోల్కతా చేరుకున్న రూబియో.. మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించారు. సతీమణి జీనెట్తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన థెరీసాకు నివాళులర్పించారు. అనంతరం ఆమె సేవా తత్వాన్ని కొనియాడుతూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత పర్యటనలో భాగంగా మే 26న ఢిల్లీలో జరగనున్న క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో రూబియో పాల్గొననున్నారు. ఈ కూటమిలో భారత్ సహా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా భాగస్వాములుగా ఉన్నాయి.