పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ కోల్పోయిన ఆయన పార్టీ కూటమి
పారిస్, జూన్ 20: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన ఇమ్మానుయేల్ మాక్రాన్కు పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. సోమవారం విడుదలైన ఫలితాలతో ఆయన పార్టీ కూటమి పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయింది.
577 స్థానాలు గల పార్లమెంట్లో 289 స్పష్టమైన మెజార్టీ కాగా, మాక్రాన్కి చెందిన మధ్యేవాద కూటమి 245 స్థానాల్లో గెలుపొందింది. ఇక, జీన్లూక్ మెలెన్చోన్ నేతృత్వంలోని కొత్త వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ సోషల్ యూనియన్ (ఎన్యూపీఈఎస్) 131 స్థానాల్లో విజయం సాధించి రెండో ప్లేస్లో నిలిచింది. మితవాద నేషనల్ ర్యాలీ పా ర్టీకి 89 స్థానాలు దక్కాయి. తాజా ఫలితాలు ఫ్రెంచ్ రాజకీయాలను గందరగోళంలో పడేశాయి.