సిడ్నీ: కరోనా డెల్టా వేరియంట్తో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వణికిపోతున్నది. దీంతో వైరస్ విజృంభణను కట్టడిచేయడానికి ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ను పొడిగిందిచింది. సెప్టెంబర్ చివరి వరకు సిడ్నీలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. అదేవిధంగా పట్టణంలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. గత రెండు నెలలు కరోనా వేరింట్ వ్యాప్తిని తగ్గకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా న్యూ సౌత్వెల్స్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో కొత్తగా 644 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఎక్కువగా సిడ్నీలో ఉన్నాయని న్యూ సౌత్వెల్స్ ప్రీమియర్ బెరెజిక్లైన్ చెప్పారు. అంతకుముందు 681 కేసులు రికార్డయ్యాయని చెప్పారు. గత ఏడు రోజులుగా ప్రతిరోజు 400కుపైగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. దీంతో సిడ్నీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న 12 లోకల్ కౌన్సిళ్లలో వచ్చే సోమవారం నుంచి రాత్రి 9 గంటల నుంచి మరుసటిరోజు 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు.