కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో బ్రిటన్ సైనికుల 20 ఏండ్ల పోరాటం ముగిసింది. బ్రిటన్ సైనికులు స్వదేశానికి పయణమయ్యారని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సైనికులతో కూడిన చివరి విమానం కాబూల్ నుంచి బయల్దేరిందని ఆ దేశ రక్షణశాఖ వెల్లడించింది. ఆఫ్ఘన్ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత 15 వేలకుపైగా మందిని అక్కడి నుంచి తరలించామని పేర్కొంది. మన సాయుధ దళాలను చూసి గర్వపడాలని, మెరుగైన జీవనం గడపడానికి వస్తున్న వారికి స్వాగతం చెబుతున్నామని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ అన్నారు. ఇంకా అక్కడ మిగిలివారి గురించి చింతిస్తున్నామని తెలిపారు.
2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన దాడి తర్వాత అల్ఖైదా ఉగ్రవాదులపై పోరాటం ప్రారంభమయ్యిందని, 20 ఏండ్లపాటు జరిగిన ఈ పోరులో తమ దెశానికి చెందని 450 సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ నెలాఖరు వరకు ఆఫ్ఘన్ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో బ్రిటన్ కూడా విదేశీ కార్యాలయాన్ని మూసివేసిందన్నారు. శుక్రవారం 800 నుంచి 11 వందల మందని ఆఫ్ఘన్లను అక్కడి నుంచి బ్రిటన్కు తరలించామని వాలెస్ చెప్పారు.