లాహోర్ హైకోర్టులో పాకిస్థాన్ మహిళ ఆవేదన
న్యూఢిల్లీ, మే 31: తనకు న్యాయం చేయలేకపోతే భారత్కు అయినా పంపాలని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ లాహోర్ హైకోర్టును వేడుకున్నది. తన 1,400 చదరపు అడుగుల ఇంటిని కబ్జాదారుల నుంచి తిరిగి ఇప్పించాలని బహవల్నగర్కు చెందిన సైదా షెహనాజ్ బీబీ గత 35 ఏండ్లుగా పోరాడుతూ ఉన్నది.
‘కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరిగినా ల్యాండ్ మాఫి యా చేతుల్లో నుంచి నా ఇంటిని తిరిగి ఇప్పించకపోతే దేశంలో ఉండటంలో అర్థమే లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.