సియోల్, అక్టోబర్ 12: అమెరికాపై అణ్వస్త్ర దాడులే లక్ష్యంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన క్షిపణులను ఉ త్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉ న్ పరిశీలించారు. అధికార వర్కర్స్ పార్టీ 76వ వార్షికోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్లో ఏర్పాటుచేసిన ఆయుధ వ్యవస్థల ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ ప్రదర్శనలో ఆ క్షిపణులను కూడా ఉంచారు. వాటిని సందర్శించిన అనంతరం కిమ్ మాట్లాడుతూ ఉత్తర కొరియాకు అజేయ సైన్యాన్ని నిర్మిస్తానని ప్రతినబూనారు. అమెరికా తప్పుడు నిర్ణయాలు, చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టిస్తూనే ఉందని మండిపడ్డారు.