సియోల్: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. ఓ మిలిటరీ విందులో పాల్గొన్నారు. చాలా గ్రాండ్గా జరిగిన ఆ వేడుకకు కూతురు, భార్యతో కలిసి వచ్చారు. చాలా విలాసవంతంగా జరిగిన బాంక్వెట్కు .. ఫ్యామిలీలో కిమ్ రావడం అందర్నీ స్టన్ చేసింది. కిమ్తో విందులో పాల్గొన్న ఆ అమ్మాయి పేరు జూ యే. ఆమె వయసు తొమ్మిదేళ్లు. కిమ్ తర్వాత ఆ దేశ వారసురాలు ఆమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య రీ సోల్ జూ కూడా విందులో పాల్గొనడం విశేషం. కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
కూతురుతో కలిసి కిమ్ విందుకు హాజరుకావడం మిలిటరీ అధికారుల్ని ఆశ్చర్యానికి గురి చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కిమ్ ఫ్యామిలీ విందుకు వస్తున్న ఫోటోలను స్థానిక రోడాంగ్ సిన్మున్ పత్రిక ప్రచురించింది. బాంక్వెట్లో టేబుల్ సెంటర్ సీటులో కిమ్ తన కూతుర్ని కూర్చోబెట్టారు. మిలిటరీ ఈవెంట్కు కూతుర్ని తీసుకువచ్చిన రాచరిక పాలన సంకేతాల్ని కిమ్ ఇచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.
కిమ్ తన కూతుర్ని చాలా ఇష్టపడుతారని, ఇటీవల జరిగిన ఓ మిస్సైల్ పరీక్ష సమయంలోనూ ఆమెను అక్కడకు తీసుకువచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఉత్తర కొరియాకు కాబోయే నేత ఆమే అన్న సందేహాల్ని కిమ్ లేవనెత్తారు. అయితే కిమ్ కనిపించకుండా పోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తన కూతురుతో ఆయన ప్రత్యక్షం కావడం అందరికీ అయోమయంగా మారింది.