మెల్బోర్న్, జనవరి 12: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న హిందూ దేవాలయం స్వామినారాయణ మందిరంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు. దేవాలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ‘ఆస్ట్రేలియా టుడే’ కథనం ప్రకారం స్వామినారాయణ మందిరానికి వచ్చిన ఖలిస్థాన్ మద్దతుదారులు తమతో తెచ్చుకున్న రంగులను దేవాలయం గోడలకు పులిమారు.
తర్వాత తమ రాతలతో దేవాలయం గోడలను ఖరాబు చేశారు. ముఖ్యంగా భారత్ నశించాలి, భారత్లో ఉగ్రవాదం వర్ధిల్లాలి వంటి నినాదాలతో పాటు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు.