అమెరికా : అమెరికా అధ్యక్షడు ట్రంప్పై హత్యాయత్నం కలకలం రేపింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో(Washington Hilton Hotel) నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో(White House) దుండగుడుకాల్పులు జరిపాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కాగా, కాల్పులు జరిగినప్పుడు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(K.A. Paul) అదే హోటల్లో బస చేశారు. కాల్పుల ఘటనపై పాల్ స్పందిస్తూ తాను ఎప్పుడు అమెరికా వచ్చిన ఇదే హోటల్లో ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. యుద్ధాల వల్లే ఈ పరిస్థితి తెలెత్తిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. యుద్ధం ముగించి శాంతి కోసం పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు.